
జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. జీడిమెట్ల శాటిలైట్ టౌన్షిప్కు చెందిన కొల్లు ఏసుబాబు ‘విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్’ పేరుతో హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, ఇతర మ్యాన్ పవర్సర్వీసులను నిర్వహిస్తున్నాడు. ఈ పనుల కోసం 2022లో మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండర్గా ఉన్న దుండిగల్లోని అరుంధతి హాస్పిటల్తో రూ.52 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు.
మొత్తం 28 మంది సిబ్బందిని అందించగా.. అందుకు రూ.52 లక్షలు చెల్లిస్తామని రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్లు బాధితుడు తెలిపారు. అయితే ఇప్పటివరకు పలు దఫాల్లో కేవలం రూ.32 లక్షలే చెల్లించారని, మిగిలిన డబ్బుల కోసం పలుమార్లు అడిగినా స్పందించలేదన్నారు. దీంతో అరుంధతి హాస్పిటల్ ఫౌండర్గారాజశేఖర్రెడ్డి తనను చీటింగ్ చేశాడని, ఆయనతో తనకు ప్రాణహాని ఉన్నట్లు బాధితుడు హైదరాబాద్లోని పేట్బషీరాబాద్పోలీసులకు ఈ నెల 10న ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.